
పార్టీ కేడర్ను పట్టించుకోవడం లేదు
సాక్షి,యాదాద్రి: కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు పార్టీ కేడర్ను పట్టించుకోవడంలేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ కిరణ్కుమార్రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్కుమార్రెడ్డి, మందుల సామేల్, మహిళా కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి, అండెం సంజీవరెడ్డి, నీలం పద్మ, ప్రమోద్ కుమార్, తంగెల్లపల్లి రవికుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీలో కొద్దిమందికే ప్రాధాన్యత లభిస్తుందని, అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కోసం శ్రమించిన వారిని పార్టీలో కనబడకుండా చేస్తున్నారని పార్టీ పరిశీలకులకు ఫిర్యాదు చేశారు. పార్టీ కార్యక్రమాలకు కనీసం సమాచారం ఇవ్వడంలేదని ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి ఆరోపించారు. అయితే గ్రామ, మండల, బ్లాక్, డీసీసీ అధ్యక్ష పదవులను కొత్తవారితో భర్తీ చేస్తామని జిల్లా ఇన్చార్జ్లు ధనవంతి, డాక్టర్ అనిల్కుమార్ ప్రకటించారు. ఎవరెవరు పోటీలో ఉంటారో ముందుకు రావాలని కోరారు.
కార్యకర్తలకు అండగా ఉంటాం
కాంగ్రెస్ పార్టీకి బలమైన కార్యకర్తలకు అండగా ఉంటామని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఎంపీ కిరణ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని తెలిపారు.
ఫ కాంగ్రెస్ జిల్లా సమీక్షా సమావేశంలో పార్టీ ముఖ్య కార్యకర్తల ఆవేదన