ఆదర్శం.. ఆ అధికారి | - | Sakshi
Sakshi News home page

ఆదర్శం.. ఆ అధికారి

Apr 28 2025 1:39 AM | Updated on Apr 28 2025 1:39 AM

ఆదర్శ

ఆదర్శం.. ఆ అధికారి

కోదాడ: కోదాడ ఆర్డీఓ తన ఇద్దరు కుమారులను ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వారు కూడా ఇటీవల విడుదలైన ఇంటర్‌ ఫలితాల్లో 95 శాతానికి పైగా మార్కులు సాఽధించి తండ్రికి తగ్గ తనయులు అనిపించారు. కోదాడ ఆర్డీఓగా సూర్యనారాయణ రెండు సంవత్సరాల క్రితం ఖమ్మం జిల్లా నుంచి బదిలీపై వచ్చారు. ఆయన పెద్దకుమారుడు షణ్ముఖనాయుడు, చిన్నకుమారుడు యోషిత్‌నాయుడిని కోదాడలోని కేఆర్‌ఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో చేర్పించాడు. వారిద్దరూ ఆర్ట్స్‌ విభాగానికి చెందిన హెచ్‌ఈసీ గ్రూప్‌ తీసుకున్నాడు. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో పెద్ద కుమారుడు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 1000 మార్కులకు గాను 960 మార్కులు సాధించగా, చిన్న కుమారుడు ఫస్టియర్‌లో 500 మార్కులకు 490 మార్కులు సాధించి జిల్లా టాపర్స్‌గా నిలిచారు.

ఉన్నత ఉద్యోగమే లక్ష్యం

ఉన్నత ఉద్యోగం సాధించడమే లక్ష్యం. ఇంటర్‌ ఫస్టియర్‌లో 500కు 490 మార్కులను సాధించడం ఆనందంగా ఉంది. మానాన్న చూపిన బాటలో నడిచి ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తాను. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో మా అన్న కన్నా ఎక్కువ మార్కులు సాధించేందుకు కృషి చేస్తా.

– యోషిత్‌నాయుడు

డిగ్రీ కూడా ప్రభుత్వ కాలేజీలోనే..

ఇంటర్‌ హెచ్‌ఈసీలో 960 మార్కులను సాధించడం ఆనందంగా ఉంది. డిగ్రీ కూడా ప్రభుత్వ కళాశాలలోనే చదువుతా. సివిల్స్‌ సాధించడమే లక్ష్యంగా నా చదువును కొనసాగిస్తాను. మానాన్నే నాకు ఆదర్శం. ఆయన మాట నిలబెడతా.

– షణ్ముఖనాయుడు

తన కుమారులను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదివిస్తున్న కోదాడ ఆర్డీఓ

ఇంటర్‌ ఫలితాల్లో 95 శాతానికి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు

ఆదర్శం.. ఆ అధికారి1
1/2

ఆదర్శం.. ఆ అధికారి

ఆదర్శం.. ఆ అధికారి2
2/2

ఆదర్శం.. ఆ అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement