
విద్యుదాఘాతంతో ప్లంబర్ మృతి
సంస్థాన్ నారాయణపురం: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన సంఘటన సంస్థాన్నారాయణపురం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చిమిర్యాల గ్రామానికి చెందిన కొల్లూరి పవన్(19) ప్లంబర్గా పనిచేస్తున్నాడు. కొత్తగూడెం గ్రామంలో నూతన ఇంటిలో జరుగుతున్న ప్లంబర్ పనికి వెళ్లాడు. ప్లంబింగ్ మిషన్కు ఎర్తు రావడంతో పవన్ విద్యుదాఘాతానికి గురయ్యాడు. గమనించిన చుట్టుపక్కల వారు అతడిని చికిత్స నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే పవన్ మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జగన్ తెలిపారు.