
‘బడిబాట’కు వేళాయె..
జిల్లాల వారీగా పాఠశాలల వివరాలు
జిల్లా పీఎస్లు యూపీఎస్లు హైస్కూళ్లు
హనుమకొండ 314 72 147
వరంగల్ 321 68 123
విద్యారణ్యపురి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంపే లక్ష్యంగా ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహణకు ఉపాధ్యాయులు సన్నద్ధమయ్యారు. నేటి(శుక్రవారం)నుంచి 19వరకు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తమ పరిధిలోని ప్రాంతాల్లో బడిబాట నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ మార్గదర్శకాలు ఇప్పటికే జారీ అయ్యాయి.
విద్యార్థులు లేని పాఠశాలలను తెరుస్తారు..
వరంగల్ జిల్లాలో 126 పాఠశాలల్లో అసలు విద్యార్థులే లేరు. గతేడాది ఆయా టీచర్లను వేరే పాఠశాలల్లో సర్దుబాటు చేశారు. విద్యార్థులను చేర్పించని టీచర్లకు ఇతర స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు.
రోజువారీగా కార్యక్రమాలు ఇలా..
● 6న బడిబాటలో భాగంగా గ్రామసభలు, అవగాహన ర్యాలీలు నిర్వహించాలి. స్వయం సహాయక సంఘాలు ,హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు తదితరులను భాగస్వాములను చేయాలి.
● 7న ఇంటింటికి తిరుగుతూ బడీడు పిల్లలను గుర్తించాలి. గ్రామ విద్యార్థి రిజిస్టర్ను నవీకరించాలి.
● 8 నుంచి 10వ తేదీవరకు ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయడంతోపాటు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలను సందర్శించాలి.
● 11న బడిబాట ప్రగతిని చర్చించేందుకు గ్రామసభ నిర్వహించాలి.
● 12న అమ్మ ఆదర్శ కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను ప్రజాప్రతినిధులతో ప్రారంభించి అదే రోజు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, స్కూల్ యూనిఫామ్స్ అందించాలి.
● 13న సామూహిక అక్షరాభ్యాసం, బాలలసభ నిర్వహించాలి.
● 16న ఎఫ్ఎల్ఎన్, లిప్ దినోత్సవం జరపాలి.
● 17న విలీన విద్య, బాలికా దినోత్సవంను నిర్వహించాలి.
● 18 తరగతి గదుల డిజిటలీకరణపై అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యాన్ని వివరించాలి.
● 19 బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు వివిధ క్రీడాపోటీలు నిర్వహించాలి.
నేటినుంచి 19 వరకు నిర్వహణ
చివరి రోజు విద్యార్థులకు క్రీడాపోటీలు
విద్యార్థులు లేని స్కూళ్ల పునఃప్రారంభానికి ఓకే..
జిల్లాలో 126 పాఠశాలల్లో సున్నా సంఖ్య
విద్యార్థుల నమోదే లక్ష్యం..
జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థుల నమోదుకు బడిబాట నిర్వహించాలి. జిల్లా కేంద్రంలోని మడికొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడిబాట కార్యక్రమాన్ని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి ప్రారంభిస్తారు. అక్కడే గ్రామసభ నిర్వహించి, తల్లిదండ్రులను, మహిళా సమాఖ్యలను, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములయ్యేలా చూస్తాం. – బద్దం సుదర్శన్రెడ్డి,
హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్, కో–ఆర్డినేటర్

‘బడిబాట’కు వేళాయె..