
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి
నర్సంపేట రూరల్: ప్రతి ఒక్కరూ మొక్కలు సంరక్షించి పర్యావరణాన్ని కాపాడాలని మండల న్యాయసేవ సంస్థ చైర్మన్, సబ్ కోర్టు జడ్జి వరూధిని అన్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా నర్సంపేట కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సంజయ్కుమార్, కార్యదర్శి మోటూరి రవి, న్యాయవాదులు దాసి రమేశ్, పుట్టపాక రవి, సునీత, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
పోలీస్స్టేషన్ ఆవరణలో..
ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా నర్సంపేటలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏఎస్ఆర్ సేవా స్వచ్ఛంద సంస్థ బాధ్యుడు ఎరబోయిన రాజశేఖర్ ఆధ్వర్యంలో సీఐ రఘుపతిరెడ్డి మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎస్సై రవికుమార్, ప్రతిభ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు గిరగాని సుదర్శన్, స్వయం కృషి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుడు బెజ్జంకి ప్రభాకర్, కాసుల వెంకటాచారీ, గుంటి సంజీవ, పోలీసులు వీరన్న, శ్రీలత, మహేశ్, భిక్షపతి, రవి తదితరులు పాల్గొన్నారు.