
కాంగ్రెస్తోనే పేదల ఇంటి కల సాకారం
నెక్కొండ: కాంగ్రెస్తోనే పేదల ఇంటి కల సాకారమవుతుందని పీసీసీ సభ్యుడు రంజిత్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రావుల హరీశ్రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని దీక్షకుంట్ల గ్రామంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బక్కి అశోక్, నెక్కొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పెండ్యాల హరిప్రసాద్, జిల్లా ఎస్టీ సెల్ ఉపాధ్యక్షుడు లావుడ్య తిరుమల్ చౌహాన్, మండల కాంగ్రెస్ నాయకులు ఈదునూరి సాయికృష్ణ, కుసుమ చెన్నకేశవులు, ఆవుల శ్రీనివాస్, నర్సంపేట కోర్టు ఏజీపీ బండి శివకుమార్, శ్రీకాంత్, మెర్గు కుమార్, స్వామి, పులి నవీన్, రాజుకుమార్, సూరయ్య, రాంబాబు, రాజు, తదితరులు ఉన్నారు.
పీసీసీ సభ్యుడు రంజిత్రెడ్డి
అర్హులకు ఇళ్ల పత్రాల అందజేత