భూ సమస్యల పరిష్కారానికి భూభారతి | - | Sakshi
Sakshi News home page

భూ సమస్యల పరిష్కారానికి భూభారతి

Jun 6 2025 12:58 AM | Updated on Jun 6 2025 12:58 AM

భూ సమస్యల పరిష్కారానికి భూభారతి

భూ సమస్యల పరిష్కారానికి భూభారతి

కమలాపూర్‌ : భూ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భూ భారతిని తీసుకొచ్చిందని అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి అన్నారు. మండలంలోని అంబాల, గూడూరు గ్రామాల్లో గురువారం నిర్వహించిన భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా భూ సమస్యలపై పలువురు రైతులు అడిగిన అనుమానాలను నివృత్తి చేశారు. అనంతరం రైతుల నుంచి భూ సమస్యలకు సంబంధించి అంబాలలో 230, గూడూరులో 161 దరఖాస్తులు స్వీకరించారు. ఏఎంసీ చైర్‌ పర్సన్‌ తౌటం ఝాన్సీరవీందర్‌, వైస్‌ చైర్మన్‌ దేశిని ఐలయ్య, తహసీల్దార్‌ ఎం.సురేష్‌కుమార్‌, నాయబ్‌ తహసీల్దార్‌ శోభారాణి, సర్వేయర్‌ గోపికృష్ణ, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ వెంకట్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement