
ఈ–పాస్ మిషన్లతోనే ఎరువులు విక్రయించాలి
● కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: ఈ–పాస్ మిషన్లతో ఎరువులను విక్రయించాలని కలెక్టర్ సత్యశారద సూచించారు. వరంగల్ శివనగర్లోని సాయి కన్వెన్షన్లోని రిటైల్ ఎరువుల వ్యాపారులకు శుక్రవారం ఎల్–1 ఈపాస్ మిషన్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్యశారద హాజరై డీలర్లకు ఈపాస్ మిషన్లు పంపిణీ చేసి మాట్లాడారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, ఏడీఏ దామోదర్రెడ్డి, నర్సింగం, ఏఓ రవీందర్రెడ్డి, టెక్నికల్ ఏఓ కృష్ణారెడ్డి, కోరమండల్ కంపెనీ ప్రతినిధులు సుజనకుమార్, సుమన్రెడ్డి పాల్గొన్నారు
ప్రత్యేక ప్రణాళికతో ధాన్యం కొనుగోళ్లు
ఖానాపురం: జిల్లా వ్యాప్తంగా 1.25 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు. ఈ మేరకు మండల కేంద్రంలోని సబ్మార్కెట్ యార్డు, బుధరావుపేట, మంగళవారిపేటలో తడిసిన ధాన్యాన్ని శుక్రవారం జిల్లా అధికారులతో కలిసి ఆమె పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. తడిసిన ధాన్యాన్ని బాయిల్డ్ మిల్కు పంపేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో మరో 70 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నట్లు అంచనా వేస్తున్నట్లు తెలి పారు. ఇందులో నర్సంపేట నియోజకవర్గంలోనే 50 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉందని, ప్రత్యేక ప్రణాళికతో ధాన్యం కొనుగోలు చేసి తరలించడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సివిల్ సప్లయీస్ డీఎం సంధ్యారాణి, డీసీఓ నీరజ, డీఏఓ అనురాధ, ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ కమిటీ వైస్చైర్మన్ హరిబాబు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి, తహసీల్దార్ కృష్ణ, ఏఓ శ్రీనివాస్, సివిల్ సప్లయీస్ డీటీ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
జీపీఓ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
న్యూశాయంపేట: వరంగల్లోని ఇస్లామియా జూనియర్ కళాశాలలో ఆదివారం నిర్వహించనున్న జీపీఓ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. జీపీఓ పరీక్షల నిర్వహణపై కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అదేవిధంగా ఉద్యాన శాఖపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. రైతుల ఆదాయాన్ని పెంచే దిశగా ఉద్యాన సాగును విస్తృతం చేయాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు.

ఈ–పాస్ మిషన్లతోనే ఎరువులు విక్రయించాలి