
వినడం, హామీ ఇవ్వడం కాదు.. పని పూర్తిచేయాలి ...
ఇటు టీడీపీ, అటు వైఎస్సార్సీపీతో పనిలేకుండా మాకు ఏ మాత్రం అఽధికారం వచ్చినా ఇక్కడ వంతెన నిర్మిస్తాం. ఇక్కడి 50 గ్రామాల ప్రజల కలను నెరవేరుస్తాం. 2018లో రాజాం నియోజకవర్గం సంతకవిటి మండలంలో వాల్తేరు గ్రామంలో బలసలరేవు వద్ద నాగావళి నదిపై వంతెన నిర్మాణం నిమిత్తం ప్రజలుచేస్తున్న పోరాటానికి మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ. ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఏడాదైనా గత జగన్మోహన్రెడ్డి ప్రభు త్వం రూ. 87 కోట్ల ఖర్చుతో తలపెట్టిన వంతెన నిర్మాణాన్ని పూర్తిచేసేందుకు చొరవ తీసుకోకపోవడంపై జనం మండిపడుతున్నారు.