
వ్యాన్ బోల్తా: పలువురికి గాయాలు
గజపతినగరం: మండలకేంద్రంలోని ఆంజనేయ స్వామి అలయం సమీపంలో జాతీయ రహదారి వద్ద వ్యాన్ బోల్తా పడడంతో జరిగిన ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయాల పాలయ్యారు. సోమవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదం వివరాలలోకి వెళ్తే.. బొబ్బిలి నుంచి విజయనగరం మొక్కజొన్న లోడుతో ప్రయాణిస్తున్న వ్యాన్ గజపతినగరం మండల కేంద్రంలో అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టి బోల్తా పడింది. ఆ వ్యాన్లో పద్మనాభం మండలం అయినాడకు చెందిన ఎం.రాము, జి.శివ, డి.మురళీకృష్ణ, బి.సాయిలకు గాయాలయ్యాయి. వారిలో రాము పరిస్థితి విషమంగా ఉండడంతో హుటాహుటిన విజయనగం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. మిగతావారికి గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు అందజేసి బుధవారం మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి తరలించినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. ఫిర్యాదు మేరకు ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.