మే నెలాఖరులోగా సారా రహిత జిల్లా | - | Sakshi
Sakshi News home page

మే నెలాఖరులోగా సారా రహిత జిల్లా

Apr 23 2025 7:57 PM | Updated on Apr 23 2025 8:01 PM

విజయనగరం అర్బన్‌: మే నెలాఖరు నాటికి సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయాలని అధికారులను జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.సేతుమాధవన్‌ కోరారు. సారాకు సంబంధించిన ఫిర్యాదుల స్వీకరణ కోసం ఏర్పాటు చేసి టోల్‌ఫ్రీ నంబర్‌కు 14405కు విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రొహిబిషన్‌, ఎకై ్సజ్‌శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవోదయం 2.0 కార్యక్రమం అమలుపై వివిధ శాఖల అధికారులతో సారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని మంగళవారం ఆయన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా సారా తయారీ కానీ, వినియోగం కానీ జరగడం లేదని అన్ని పంచాయతీల నుంచి తీర్మానాలు తీసుకునే ప్రక్రియను మే 15లోగా పూర్తి చేయాలని కోరారు. అలాగే మండలాల నుంచి తీర్మానాలను కూడా త్వరగా పూర్తి చేయాలన్నారు. ముఖ్యంగా అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో నవోదయం 2.0 కార్యక్రమం అమలు, తీసుకున్న చర్యలను ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ జి.శ్రీనాథుడు వవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. సమావేశంలో డీఆర్‌ఓ శ్రీనివాసమూర్తి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి, డీఆర్‌డీఏ పీడీ కల్యాణ్‌చక్రవర్తి, డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రాజ్యలక్ష్మి, జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఎస్‌.అప్పలనాయుడు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు, డీఎస్పీ వీరకుమార్‌, అబ్కారీ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల కోసం టోల్‌ ఫ్రీ నెంబర్‌ 14405

జాయింట్‌ కలెక్టర్‌ సేతు మాధవన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement