మన్యంలో మరో చిన్నారి మృతి | - | Sakshi
Sakshi News home page

మన్యంలో మరో చిన్నారి మృతి

Jan 27 2025 6:17 AM | Updated on Jan 27 2025 6:17 AM

మన్యంలో మరో చిన్నారి మృతి

మన్యంలో మరో చిన్నారి మృతి

శృంగవరపుకోట: మన్యంలో మృత్యుఘోష ఆగడం లేదు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యమో, గిరిజనం శాపమో కానీ చిన్నారులు ప్రాణాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఆదివారం మండలంలోని గిరిశిఖర గ్రామంలో మరో చిన్నారి తనువు చాలించాడు. ఈ ఘటనకు సంబంధించి మృతుని తల్లిదండ్రులు చిన్నాలమ్మ, దేవా, ఏపీ గిరిజన సంఘ నాయకులు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. మండలంలో దారపర్తి పంచాయతీ చిలకపాడు గ్రామానికి చెందిన ఏడాది వయస్సున్న బాలుడు జన్ని విజయ్‌కు ఇటీవల టీకా వేయించారు. తర్వాత బాలుడికి జ్వరం రావడంతో కొండ కింద ఎస్‌.కోట పట్టణంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకొచ్చి వైద్యం చేయించారు. వైద్యులు విజయనగరం ఘోషాఆస్పత్రికి వెళ్లాలని సూచించడంతో తీసుకెళ్లి వైద్యం చేయించారు. శనివారం సాయంత్రం వైద్యులు డిశ్చార్జ్‌ చేయడంతో గ్రామానికి తీసుకొచ్చారు. కాగా ఆదివారం సాయంత్రం 5.30గంటల సమయంలో చిన్నారి విజయ్‌ మరణించాడు. దీంతో ఒక్కసారిగా గ్రామంలో విషాదం అలుముకుంది. వైద్యసిబ్బంది గ్రామాల్లోకి రాకపోవడం వల్లనే తమకు ఈ పరిస్థితి వస్తోందని గిరిజనులు చెబుతున్నారు.

వైద్యం పూజ్యమైందంటున్న గిరిజనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement