
ఐటీఐ కౌన్సెలింగ్ ప్రారంభం
తాటిచెట్లపాలెం: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2025–26 విద్యా సంవత్సరానికి వివిధ ట్రేడుల్లో ప్రవేశానికి గురువారం కౌన్సెలింగ్ ప్రారంభమైంది. తొలి రోజు 1 నుంచి 479 ర్యాంకర్లను కౌన్సెలింగ్కు పిలవగా 226 మంది హాజరయ్యారు. ఇందులో 185 మంది ప్రభుత్వ ఐటీఐల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. అభ్యర్థులకు అర్హత పత్రాలను ఉపాధి, శిక్షణ శాఖ ప్రిన్సిపాల్, కన్వీనర్ జె.శ్రీకాంత్ అందజేశారు. శుక్రవారం జరిగే కౌన్సెలింగ్కు 480 నుంచి 1041 ర్యాంకు అభ్యర్థులు కంచరపాలెం ప్రభుత్వ ఐటీఐలో ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. కౌన్సెలింగ్లో పాల్గొన్న తల్లిదండ్రులకు, విద్యార్థులకు మంచినీరు, మజ్జిగ పాకెట్లు ఐటీఐ సిబ్బంది అందజేశారు.