
సంకల్ప బలం.. అకండ విజయం
కోటిరెడ్డి ఈ స్థాయికి చేరుకోవడానికి వెనుక, ఆనందపురం మండలం వెల్లంకి పంచాయతీ బొడ్డపాలెం గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ సాడి వెంకటేష్ ప్రోత్సాహం ఎంతగానో ఉంది. ఒక బాడీబిల్డర్ కాకుండా.. ఒక ఫొటోగ్రాఫర్ ఆయనలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం విశేషం.
● వైకల్యాన్ని అధిగమించిన కోటిరెడ్డి
● మిస్టర్ ఇండియాగా నాలుగు సార్లు
● కోచ్గా ఎంతో మందికి మార్గనిర్దేశం
● సేవల్లోనూ ఇతరులకు ఆదర్శం
విజయాలు.. సవాళ్లు
పారా బాడీ బిల్డింగ్లో కోటిరెడ్డి సాధించిన విజయాలెన్నో.. 2013లో పశ్చిమ బెంగాల్లో జరిగిన మిస్టర్ ఇండియా పోటీలో మూడవ స్థానం, 2015, 2017లో బెల్గాంలో జరిగిన సతీష్ సుగర్ క్లాసిక్ (మిస్టర్ ఇండియా) పోటీల్లో వరుసగా రెండు, మొదటి స్థానాలు కైవసం చేసుకున్నారు. 2019లో మీరట్, 2024లో తమిళనాడు, పంజాబ్లలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానాల్లో నిలిచి తన సత్తా చాటారు. ఇప్పటివరకు తగరపువలస కేంద్రంగా 2008, 2010, 2017లో మిస్టర్ ఆంధ్ర, 2014లో ఈస్ట్జోన్ స్థాయిలో బాడీ బిల్డింగ్ పోటీలతో పాటు పారా బాడీ బిల్డింగ్ పోటీలను విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఇండియన్ బాడీబిల్డింగ్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శిగా కూడా సేవలందిస్తున్నారు.
నగరంలోని బుల్లయ్య కళాశాలలో బీకాం పూర్తి చేసిన కోటిరెడ్డి.. తన ఆసక్తిని బాడీబిల్డింగ్ వైపు మళ్లించారు. ఆరేళ్ల కఠోర శిక్షణ అనంతరం దీనినే తన ఉపాధిగా మార్చుకున్నారు. గత 20 ఏళ్లుగా ఈ రంగంలో అప్రతిహతంగా కొనసాగుతున్నారు. తొలిసారిగా తగరపువలస బైపాస్రోడ్డులో శ్రీఆంజనేయం మజిల్ ప్లానెట్ జిమ్ను స్థాపించారు. అప్పట్లో ఈ జిమ్కు రూ.8 లక్షలు ఖర్చు చేయగా తర్వాత రూ.25 లక్షల విలువైన వ్యాయామ పరికరాలను అందుబాటులో ఉంచారు. తర్వాత జీవీఎంసీ భీమిలిలో జోన్ సంతపేట చిల్డ్రన్స్ పార్కులో 1,500 చదరపు అడుగు విస్తీర్ణంలో రూ.12 లక్షల పరికరాలు, నగరంలోని కృష్ణా కళాశాల వద్ద 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.70 లక్షల పరికరాలతో జిమ్లను ప్రారంభించారు. త్వరలో సంగివలస సుఖీభవ కాలనీ వద్ద 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో మరో అధునాతన జిమ్ను సిద్ధం చేస్తున్నారు. ఆనందపురంలో మరో జిమ్ను తెరచి.. తన శిష్యుడికి అప్పగించారు. కేవలం వ్యాపార దృక్పథంతోనే కాకుండా ఎంతోమంది ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్లకు ఉపాధి కల్పిస్తూ.. సామాజిక సేవలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఆర్మీ, కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడమే కాకుండా, బరువు తగ్గాలనుకునే వారికి మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం తన మకాంను నగరంలోని రామాటాకీస్ ప్రాంతానికి మార్చుకున్నారు.
భారీగానే ఖర్చు
బాడీ బిల్డింగ్ అంటే అత్యంత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మిస్టర్ ఇండియా పోటీలకు సిద్ధం కావాలంటే దాదాపు ఏడు నెలల పాటు కఠోరంగా శ్రమించాలి. రోజుకు 750 గ్రాముల చికెన్, 20 కోడిగుడ్లు, 250 గ్రాముల కూరగాయలు, పండ్లు, ప్రొటీన్ పౌడర్, మల్టీ విటమిన్ టాబ్లెట్లతో పాటు రోజుకు నాలుగు గంటల వ్యాయామం అవసరం. మిస్టర్ ఇండియా పోటీల కోసం కోటిరెడ్డి వద్దకు వచ్చే వారికి ఈ విధంగానే శిక్షణ ఇస్తారు. అయితే ఇందుకు నెలకు రూ.40,000 పైనే ఖర్చవుతుందని, పోటీలకు సిద్ధం కావడానికి మొత్తం రూ.4 లక్షల వరకు వ్యయమవుతుందని కోటిరెడ్డి తెలిపారు. గెలిచిన ప్రైజ్మనీ ఈ ఖర్చులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఖర్చుతో కూడినది కావడంతో బాడీ బిల్డింగ్ను ప్రోత్సహించేవారు తక్కువగా ఉన్నారన్నారు. కోవిడ్–19 సమయంలో జిమ్ల మూసివేత వలన ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు.
ఫొటోగ్రాఫర్ ప్రోత్సాహం
సామాజిక సేవ
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా.. కోటిరెడ్డి సేవా దృక్పథాన్ని వీడలేదు. తన తల్లిదండ్రులు బోర అప్పన్నరెడ్డి, అప్పయ్యమ్మల పేరుతో ఏటా రక్తదాన శిబిరాలు, చలివేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందిస్తున్నారు. బాడీబిల్డింగ్ను ఒలింపిక్స్లో చేర్చాలని, ఇతర క్రీడల మాదిరిగానే ప్రభుత్వ ఉద్యోగాల్లో 3 శాతం కోటా కల్పించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు. స్పాన్సర్లు ముందుకు వస్తే అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించడానికి సిద్ధంగా ఉన్నానని, 60 ఏళ్ల వయసు వరకు పోటీలలో పాల్గొంటానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ‘ఏ క్రీడ అయినా సరే.. అది మనల్ని చెడు వ్యసనాలకు దూరంగా ఉంచుతుంది. క్రమం తప్పకుండా జిమ్కు వెళితే ఉక్కులాంటి శరీరం, మంచి ఆరోగ్యం మీ సొంతమవుతుంది’ అని కోటిరెడ్డి యువతకు సందేశమిస్తున్నారు.
నిడిగట్టు నుంచి మొదలైన ఈ స్ఫూర్తిదాయక ప్రస్థానం.. ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తూ, ఆత్మవిశ్వాసంతో ఏదైనా సాధించవచ్చని నిరూపిస్తోంది. బోర కోటిరెడ్డి కేవలం ఒక బాడీబిల్డర్ మాత్రమే కాదు.. ఆయన ఒక యోధుడు, మార్గదర్శకుడు.

సంకల్ప బలం.. అకండ విజయం

సంకల్ప బలం.. అకండ విజయం

సంకల్ప బలం.. అకండ విజయం