
జిల్లా రిసోర్స్ పర్సన్లకు శిక్షణ
ఆరిలోవ: విద్యా శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి విశాఖ జల్లాల రిసోర్స్ పర్సన్ల(డీఆర్పీ)కు తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రెండు రోజులుగా శిక్షణ జరుగుతోంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. బుధవారం విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో శిక్షణ పొందిన ఎస్ఆర్పీలు(స్టేట్ ఆర్పీలు) 2015–26 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాల అకాడమీ క్యాలెండర్, గ్రంథాలయాల నిర్వహణ, సహిత విద్యలపై శిక్షణ ఇచ్చారు. ఇక్కడ శిక్షణ పొందిన డీఆర్పీలు పాఠశాలల్లో ఉపాధ్యాయులకు అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ శిక్షణలో రాష్ట్ర పరిశీలకురాలు రోజ్లిల్లీ, డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు, తోటగరువు హైస్కూల్ హెచ్ఎం దుర్గాభవాని, ఉమ్మడి పరీక్షల విభాగం కార్యదర్శి కృష్ణకుమార్ పాల్గొన్నారు.