
పద్మం సిల్వర్ జ్యూయలరీ షోరూం ప్రారంభం
మద్దిలపాలెం: మద్దిలపాలెం సీఎంఆర్ సెంట్రల్లో పద్మం 92.5 సిల్వర్ జ్యూయలరీ షోరూం శనివారం ఘనంగా ప్రారంభమైంది. సీఎంఆర్ వ్యవస్థాపకుడు, చైర్మన్ మావూరి వెంకటరమణ ఈ షోరూంను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 ఏళ్లుగా నమ్మకమైన సేవలందిస్తూ.. వినియోగదారుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నామన్నారు. అదే నమ్మకానికి నిదర్శనంగా సీఎంఆర్ గ్రూప్ నుంచి పద్మం 92.5 సిల్వర్ జ్యూయలరీ షోరూంను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రస్తుత ట్రెండ్కు తగిన బ్రాండ్లతో.. సరికొత్త వెండి ఆభరణాలతో సీఎంఆర్ సెంట్రల్ గ్రౌండ్ ఫ్లోర్లో షోరూంను ప్రారంభించామని వెల్లడించారు. ప్రారంభోత్సవ కానుకగా అన్ని రకాల వెండి ఉత్పత్తులపై ఫ్లాట్ 20 శాతం తగ్గింపు, ఆభరణాల కొనుగోలుపై గ్యారెంటీ కార్డుతోపాటు కచ్చితమైన బైబ్యాక్ పాలసీ అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల మనసుకు హత్తుకునే సరికొత్త డిజైన్లతో సిల్వర్ జ్యూయలరీ ఆభరణాలు అందుబాటులో ఉంచినట్లు వివరించారు.