హకీంపేట్‌ జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్లు | - | Sakshi
Sakshi News home page

హకీంపేట్‌ జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్లు

Jun 27 2025 6:26 AM | Updated on Jun 27 2025 6:26 AM

హకీంపేట్‌ జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్లు

హకీంపేట్‌ జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్లు

దుద్యాల్‌: మండలం ఏర్పాటయ్యి మూడు సంవత్సరాలు గడుస్తున్నా, ఇంటర్మీడియట్‌ కాలేజీ లేకపోవడంతో విద్యార్థులు ఇతర మండలాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. 6 నెలల క్రితం సీఎం రేవంత్‌రెడ్డి హకీంపేట్‌కు ఇంటర్‌ కళాశాల మంజూరు చేశారు. దీంతో గ్రామంలోని గోశాల సమీపంలో తాత్కాలికంగా కళాశాల కోసం మూడు గదులు ఏర్పాటు చేశారు. ప్రస్తుత అకాడమీక్‌ సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించారు. ఈ కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంఎల్‌టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ కోర్సులకు గాను సిబ్బంది అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎంపీసీ–10, బైపీసీ–32, సీఈసీ–16, హెచ్‌ఈసీ–06, ఎంఎల్‌టీ–05, ఎంపీహెచ్‌డబ్ల్యు–11 సీట్లను బర్తీ చేసినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement