దిగబడిన వరిధాన్యం లారీ | - | Sakshi
Sakshi News home page

దిగబడిన వరిధాన్యం లారీ

Jun 6 2025 7:38 AM | Updated on Jun 6 2025 7:38 AM

దిగబడిన వరిధాన్యం లారీ

దిగబడిన వరిధాన్యం లారీ

తాండూరు: తాండూరు డీసీఎంఎస్‌ కార్యాలయ ప్రధాన ద్వారం వద్ద వరిధాన్యం లోడ్‌ లారీ దిగబడింది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. డీసీఎంఆర్‌ ద్వారా కొనుగోలు కేంద్రంలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని తాండూరు డీసీఎంఎస్‌ కార్యాలయ ప్రాంగణంలోని గిడ్డంగుల్లో నిల్వ చేస్తున్నారు. అందులో భాగంగా యాలాల మండలం నుంచి 18 టైర్లు కలిగిన పెద్ద లారీలో వరి ధాన్యంతో డీసీఎంఎస్‌ గేట్‌లోకి ప్రవేశించింది. ఇటీవల రోడ్డు వెడల్పుతో డీసీఎంఎస్‌ గేట్‌ వద్ద గుంతలా మారింది. దీంతో లారీ రెండు వైపులా ఇరుక్కుపోయి అక్కడే ఆగిపోయింది. బుధవారం రాత్రి నుంచి లారీని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించినా వీలు కాలేదు. మరోసారి గురువారం ఉదయం లారీని పక్కకు తప్పించేందుకు ప్రయత్నించారు. వీలు కాకపోవడంతో లారీలో ఉన్న ధాన్యం బస్తాలను దింపి పక్కకు తప్పించారు. దీంతో కొనుగోలు కేంద్రాల నుంచి లోడ్‌తో వచ్చిన లారీలు రోజంతా నిలిచిపోయాయి.

డీసీఎంఎస్‌ గేట్‌ దాటుతుండగా ఘటన

గోదాంలలోకి వాహనాల

రాకపోకలకు అంతరాయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement