పట్టుబడ్డ గంజాయిని కొట్టేసి.. | - | Sakshi
Sakshi News home page

పట్టుబడ్డ గంజాయిని కొట్టేసి..

Jun 6 2025 7:38 AM | Updated on Jun 6 2025 7:38 AM

పట్టుబడ్డ గంజాయిని కొట్టేసి..

పట్టుబడ్డ గంజాయిని కొట్టేసి..

షాద్‌నగర్‌ రూరల్‌: వచ్చే జీతంతో తృప్తి పడని ఓ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పని చేసే స్టేషన్‌లోనే గతంలో పట్టుబడిన గంజాయిని దొంగిలించి.. విక్రయిస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన పట్టణంలోని ఫరూఖ్‌నగర్‌ ఈద్గా వద్ద చోటుచేసుకుంది. పట్టణ సీఐ విజయ్‌కుమార్‌ గురువారం వివరాలు వెల్లడించారు. వికారాబాద్‌ జిల్లా తాండూరు ఎకై ్సజ్‌ పోలీస్‌ స్టేషన్‌లో గులామ్‌ సుల్తాన్‌ అహ్మద్‌ ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. జల్సాలకు అలవాటుపడ్డ అతను వచ్చే వేతనం సరిపోక అక్రమ మార్గం ఎంచుకున్నాడు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేస్తూ విలాస జీవితానికి అలవాటుపడ్డాడు.

అక్కడ దొంగిలించి.. ఇక్కడ విక్రయిస్తూ

స్టేషన్‌లో గతంలో పట్టుబడిన గంజాయిని గులామ్‌ సుల్తాన్‌ అహ్మద్‌ దొంగిలించేవాడు. దానికి తనకు వరుసకు కుమారుడైన షాద్‌నగర్‌ పట్టణానికి చెందిన అంజాద్‌కు విక్రయించేందుకు అప్పగించేవాడు. ఈ క్రమంలో తన వద్ద ఉన్న రూ.75 వేల విలువ చేసే కిలోన్నర గంజాయిని విక్రయించేందుకు అంజాద్‌ బుధవారం రాత్రి ఈద్గా సమీపంలోకి చేరుకున్నాడు. అదే సమయంలో ఎస్‌ఐ దేవరాజ్‌ అధ్వర్యంలో సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తున్నారు. అంజాద్‌ కవర్‌ పట్టుకొని అనుమానాస్పదంగా తచ్చాడడం గమనించారు. అతడి వద్ద ఉన్న కవర్‌ను పరిశీలించగా అందులో గంజాయి ఉన్నట్టు గుర్తించారు. దీంతో విచారించగా నేరం అంగీకరించాడు. ఈ మేరకు ఇద్దరినీ రిమాండ్‌కు తరలించారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులను శంషాబాద్‌ డీసీపీ రాజేశ్‌, అడిషనల్‌ డీసీపీ పూర్ణచందర్‌, ఏసీపీ లక్ష్మీనారాయణ అభినందించారు.

బంధువు ద్వారా విక్రయం

ఎకై ్సజ్‌ కానిస్టేబుల్‌ నిర్వాకం

పోలీసుల అదుపులో నిందితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement