
ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలి
మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్
ఇబ్రహీంపట్నం: ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని మున్సిపల్ కమిషనర్ రవీంద్రసాగర్ కోరారు. 100 రోజుల స్పెషల్ డ్రైవ్లో భాగంగా గురువారం నాలుగోరోజు ఇబ్రహీంపట్నంలో దుకాణాలను తనిఖీలు చేసి ప్లాస్టిక్ ఉపయోగిస్తున్న వాటికి ఫెనాల్టీ విధించారు. అనంతరం మొక్కలు నాటి పర్యావరణంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ప్లాస్టిక్ కవర్స్ వాడకంతో పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటోందని అన్నారు. కాలుష్య వాతావరణం ఏర్పడి మనుషులతోపాటు పశుపక్ష్యాదులపై దీని ప్రభావం పడుతుందన్నారు. దుకాణాల్లో వ్యాపారస్తులు ప్లాస్టిక్ కవర్స్ను ఉపయోగించొద్దని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ ప్రవీణ్రెడ్డి, పర్యావరణ ఇంజనీర్ ప్రణవ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.