
పద్మమ్మ అంత్యక్రియలకు హాజరైన మాజీ మంత్రి
ధారూరు: చింతకుంట గ్రామంలో గురువారం మృతి చెందిన పద్మమ్మ అంత్యక్రియలకు మాజీ మంత్రి సబితారెడ్డి హాజరయ్యారు. స్వర్గీయ ఇంద్రారెడ్డి అక్క, సబితారెడ్డికి వదిన మృతి చెందినట్లు సమాచారం అందటంతో కొడుకు కారిక్రెడ్డితో కలిసి చింతకుంటకు చేరుకున్నారు. వీరితో పాటు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్రెడ్డి, జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మెతుకు ఆనంద్, మండల అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మెన్ కృష్ణారెడ్డి, హరిదాస్పల్లి పీఏసీఎస్ చైర్మెన్ వెంకట్రెడ్డి తదితరులు కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్నారు.