
పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్ల్లు
నవాబుపేట: పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే కాలె యాదయ్య పేర్కొన్నారు. మండల పరిధిలోని ఎక్మామిడి, మాదిరెడ్డిపల్లి, మైతాప్ ఖాన్ గూడ, ఎల్లకొండ గ్రామాల్లో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరైన పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షపాతి అని, సంక్షేమమే ధ్యేయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తున్న ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందేలా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అనురాధ, ఎంపీఓ విజయ్ కుమార్, నాయకులు చిట్టెపు మల్లారెడ్డి, వెంకట్ రెడ్డి, ప్రభాకర్, రంగారెడ్డి, ఎండి రఫీ, ప్రకాష్, గ్రామస్తులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే కాలె యాదయ్య