
విరమణ వయస్సు పెంచడం సరికాదు
కొడంగల్ రూరల్: ఉద్యోగ విరమణ వయస్సు పెంచడం సరికాదని ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేటలో ఎస్టీయూటీఎస్ రాష్ట్ర ద్వితీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ విరమణ వయస్సు 61నుంచి 62సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం ఆలోచించడం సరికాదన్నారు. దీంతో నిరుద్యోగులు తీవ్ర అన్యాయానికి గురవుతారన్నారు. 2023 జనవరి నుంచి పెండింగ్లో ఉన్న 5డీఏలలో సత్వరమే మూడు డీఏలను ప్రకటించాలని, పెండింగ్లోని వివిధ బిల్లులు, సరెండర్ లీవ్లు, టీఎస్జీఎల్ఐ, జీపీఎఫ్ పార్ట్ ఫైనల్ను వెంటనే మంజూరు చేయించాలని వివరించారు. సీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ షఫీ తదితరులు పాల్గొన్నారు.
ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్