
‘భూ భారతి’ని సద్వినియోగం చేసుకోండి
సబ్కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్
దౌల్తాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి చట్టాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తాండూరు సబ్కలెక్టర్ ఉమాశంకర్ప్రసాద్ సూచించారు. బుధవారం మండలంలోని నందారం గ్రామంలో నిర్వహించిన భూభారతి సదస్సును ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ఇప్పటి వరకు ఎన్ని దరఖాస్తులు స్వీకరించారని తహసీల్దారును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతులు భూ సమస్యలకు సంబంధించి తగిన ఆధారాలతో గ్రామసభలో దరఖాస్తు చేసుకుంటే వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దారు గాయత్రి, డీటీ చాంద్పాషా, నాయకులు రాజశేఖర్రెడ్డి, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చేసిన సేవలే
గుర్తింపునిస్తాయి
డీఎంహెచ్ఓ వెంకటరవణ
ధారూరు: విధి నిర్వహణలో మనం చేసిన సేవలే గుర్తింపునిస్తాయని డీఎంహెచ్ఓ వెంకటరవణ అన్నారు. బుధవారం మండలంలోని నాగసమందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన సూపర్వైజర్ లక్ష్మికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. వైద్య సేవలు చేసే మనల్ని ప్రజలు దైవంతో సమానంగా భావిస్తారని, వారి నమ్మ కాని నిలబెట్టుకోవాలని సిబ్బందికి సూచించా రు.కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ జయరాం, నాగసమందర్ పీహెచ్సీ ఇన్చార్జ్ డాక్టర్ మేఘన, హెల్త్ ఎడ్యుకేటర్ ప్రీతమ్, ల్యా బ్ టెక్నిషియన్ ఉమ, ధారూరు, నాగసమందర్ పీహెచ్సీల వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడి
యాలాల: నాణ్యమైన విత్తనాలతో మంచి దిగుబడి వచ్చి రైతులకు లాభం చేకూరుతుందని అగ్రికల్చర్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీతా అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు పంటల సాగుపై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం వరి, జొన్న, కంది విత్తనాలను పరిశోధన నిమిత్తం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నకిలీ విత్తనాల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

‘భూ భారతి’ని సద్వినియోగం చేసుకోండి

‘భూ భారతి’ని సద్వినియోగం చేసుకోండి