
పెన్షన్ల కోసం దరఖాస్తులు స్వీకరించండి
అదనపు కలెక్టర్ లింగ్యానాయక్
అనంతగిరి: అర్హులైన వారి నుంచి పెన్షన్లకు దరఖాస్తులు స్వీకరించాలని అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన జాతీయ కుటుంబ ప్రయోజన పథకంలో రైతు ఆత్మహత్య కుటుంబాలు, వితంతు పెన్షన్లు అంశాలపై సెర్ప్ సీఈఓ దివ్యదేవరాజన్, అదనపు కలెక్టర్లు, డీఆర్డీఓ, రెవెన్యూ విభాగాల అధికారులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ.. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు, వితంతు పెన్షన్లకు సంబంధించి ఆర్థిక సాయం పొందేలా దరఖాస్తులు స్వీకరించి ప్రతిపాదనలు పంపాలన్నారు. అర్హులకు పెన్షన్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. జూమ్ సమావేశంలో డీహెచ్ సూపరింటెండెంట్లు వెంకటేశ్వరి, నేమత్ అలీ, ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ మహమూద్ అలీ, డీపీఎం నర్సింలు పాల్గొన్నారు.