
చదువుతోనే ఉన్నత శిఖరాలు
అనంతగిరి: విద్యార్థులు బాగా చదువుకుని ఉన్నత స్థాయిలో స్థిరపడాలని జగజ్యోతి బసవేశ్వర విద్యా సంస్థ అధ్యక్షుడు నూలి బస్వరాజు అన్నారు. ఈ మేరకు ఆదివారం వికారాబాద్లో వీరశైవ యువదళ్ ఆధ్వర్యంలో ఇటీవల 10వ తరగతి ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన వీరశైవ జంగమ, లింగాయత్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి సమాజంలో చదువుతోనే అన్ని సాధ్యమన్నారు. పోటీ ప్రపంచంలో టాప్ స్థాయిలో రాణిస్తేనే అవకాశాలు వస్తున్నాయన్నారు. విద్యార్థులు కష్టపడి 500 పైగా మార్కులు సాధించడం గొప్ప విషయమన్నారు. ఉన్నత శిఖరాలను అధిరోహించేవరకు విశ్రమించవద్దన్నారు. కష్టపడి చదివితే విజయం తప్పక వరిస్తుందన్నారు. విద్యార్థులకు తమ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. మంచి స్థాయిలో స్థిరపడి తల్లిదండ్రులకు, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలన్నారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్పటేల్, వీరశైవ సమాజం అధ్యక్షుడు అప్ప విజయ్కుమార్, కార్యదర్శివిద్యాసాగర్, బిచ్చప్ప, వీరకాంతం, విశ్వంపంతులు, యువదళ్ అధ్యక్షుడు కోటిలింగం, సభ్యులు వసంత్, అమర్, భాను, సుధీర్పటేల్, రాజేష్, బసవేశ్వర్, శంకర్, సంతోష్, ధన్శెట్టి తదితరులు పాల్గొన్నారు.
జగజ్యోతి బసవేశ్వరవిద్యా సంస్థ అధ్యక్షుడు బస్వరాజు