
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లో కంపార్ట్మెంట్లు నిండాయి. శుక్రవారం అర్ధరాత్రి వరకు 71,721 మంది స్వామివారిని దర్శించుకోగా 36,011 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.42 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 18 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.
92.78 శాతం పింఛన్ల పంపిణీ
తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా శనివారం 92.78 శాతం పింఛన్లు పంపిణీ చేసి, రాష్ట్ర స్థాయిలో ద్వితీయ స్థానంలో నిలిచినట్టు డీఆర్డీఏ పీడీ శోభనబాబు తెలిపారు. కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ తిరుపతిలోని ఎస్టీవీ నగర్లో పలువురికి పింఛన్లు పంపిణీ చేసినట్టు వెల్లడించారు.