కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు | - | Sakshi
Sakshi News home page

కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

Jul 5 2025 6:28 AM | Updated on Jul 5 2025 6:28 AM

కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

కాణిపాకం హుండీ ఆదాయం రూ.1.68 కోట్లు

కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన హుండీని శుక్రవారం ఆలయ అధికారులు పగడ్బందీగా లెక్కించారు. ఈవో పెంచల కిషోర్‌ పర్యవేక్షణలో జరిగిన ఈ హుండీ లెక్కింపులో రూ.1,68,18,705 ఆదాయం వచ్చింది. బంగారం 52 గ్రాములు, వెండి 1.4 కిలోలు వచ్చినట్టు పేర్కొన్నారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.16,783, నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.38,751 వచ్చింది. యూఎస్‌ఏ డాలర్లు 980, సింగపూర్‌వి 33 డాలర్స్‌, మలేషియావి 64 రింగిట్స్‌, యూఏఈ 25 దిర్హామ్స్‌, కెనడా 140 డాలర్లు, ఆస్ట్రేలియావి75 డాలర్స్‌ వచ్చాయి. ఏఈవోలు ఎస్వీ క్రిష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనంజయ, ప్రసాద్‌, నాగేశ్వరరావు, కోదండపాణి, సుబ్రమణ్యనాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement