
రూ.5లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
వేలూరు: వేలూరు శ్రీపురంలోని బంగారుగుడి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది రూ.5లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని బంగారుగుడి డైరెక్టర్ సురేష్బాబు అన్నారు. ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వేలూరు గ్రీన్ సర్కిల్ వద్ద విద్యార్థులతో అవగాహణ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వాహనదారులకు మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమానికి సురేష్బాబు హాజరై వాహనదారులకు, విద్యార్థులకు మొక్కలను అందజేశారు. ఆయన మాట్లాడుతూ నారాయణి పీఠం, ఎక్స్నోరా సంయుక్తంగా చెత్తను ఎరువు చేసే పథకాన్ని ప్రారంభించాయన్నారు. ఆ సమయంలో పథకాన్ని చాలా మంది నిర్లక్ష్యంగా మాట్లాడినప్పటికీ, ప్రస్తుతం ఈ పథకం దేశ వ్యాప్తంగా విజయవంతం అయిందన్నారు. శక్తిఅమ్మ ఆశీస్సులతో సాగర్ పథకాన్ని తీసుకొచ్చి జిల్లా వ్యాప్తంగా మొక్కలు నాటే పథకాన్ని ప్రారంభిస్తామదన్నారు. ఆశక్తి గల విద్యార్థులు, అటవీశాఖ సిబ్బందితోపాటు స్వచ్ఛంద సంస్థలకు కూడా ఉచితంగా మొక్కలు అందజేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సీఐ శ్రీనివాసన్, విద్యార్థులు పాల్గొన్నారు.