3.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ | - | Sakshi
Sakshi News home page

3.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

Jun 6 2025 12:58 AM | Updated on Jun 6 2025 12:58 AM

3.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

3.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ

భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో యాసంగి సీజ్‌కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు విజయవంతంగా పూర్తయ్యాయని, మొత్తం 3.40లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లు పూర్తయిన నేపథ్యంలో గురువారం సూర్యాపేట కలెక్టర్‌ చాంబర్‌లో అదనపు కలెక్టర్‌ పి.రాంబాబుతో కలిసి సివిల్‌ సప్లయ్‌ అధికారి, డీఎం, డీఆర్‌డీఓ, డీసీఓ, వ్యవసాయ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఐకేపీ, మెప్మా, సహకార సంఘాలు, మార్కెటింగ్‌ తదితర శాఖలు సమన్వయం చేసుకుంటూ ధాన్యం సేకరించినందుకు అధికారులందరినీ ఆయన అభినందించారు. ట్రక్‌ షీట్‌ ఆన్‌లైన్‌లో నమోదైన 48 గంటల్లోనే రైతులకు డబ్బులు జమ చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే సీజన్‌ నాటికి ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉండేలా ఖరీదు చేసేందుకు అవసరమైన ప్రణాళికలను అధికారులు సిద్ధం చేయాలని ఆదేశించారు. కేసులు నమోదైన మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల ప్రకారం మూడునెలలకు ఒకేసారి సన్నబియ్యం కార్డుదారులందరికీ అందేలా జూన్‌ 30 వ తేదీ వరకు పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీఆర్‌డీఓ వివి అప్పారావు, పౌరసరఫరాల శాఖ డీఎం ప్రసాద్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారి శ్రీనివాసరెడ్డి, జిల్లా సహకార శాఖ అధికారి పద్మ, మెప్మా పీడీ రేణుక, అగ్రికల్చర్‌ అధికారి ప్రణవి, సివిల్‌ సప్లయ్‌డీటీ, ఆర్‌ ఐ, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

ఫ ధాన్యంకొనుగోళ్లు విజయవంతం

ఫ కలెక్టర్‌ తేజస్‌ నంద్‌లాల్‌ పవార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement