ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్య

May 5 2025 8:24 AM | Updated on May 5 2025 8:24 AM

ఉరేసు

ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్య

హుజూర్‌నగర్‌: ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్మ చేసుకుంది. ఈ ఘటన హుజూర్‌నగర్‌ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ ముత్తయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హుజూర్‌నగర్‌ పట్ట ణానికి చెందిన షేక్‌ ఖాసింబీ తన కుమార్తె షేక్‌ మహబూబీ అలియాస్‌ హసీనా(19)ని గత నెల 30వ తేదీన చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన షేక్‌ యూసుఫ్‌కు ఇచ్చి వివాహం చేశారు. కాగా హసీనా తన భర్త యూసుఫ్‌తో కలిసి శనివారం తన తల్లిగారింటికి వచ్చింది. ఆదివారం ఉదయం బాత్‌రూంలో స్నానం చేయడానికి వెళ్లిన హసీనా అందులో ఉన్న ఇనుప కడ్డీకి ఉరేసుకుని ఆత్మహత్మ చేసుకుంది. హసీనా ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. మృతురాలి తల్లి ఖాసింబీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

నారసింహుడికి

నిత్యారాధనలు

యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం నిత్యారాధనలు, భారీగా తరలివచ్చిన భక్తులతో కోలాహలం నెలకొంది. వేకువజామున సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపిన అర్చకులు.. గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలకారంమూర్తులకు నిజాభిషేకం చేసి సహస్రనామార్చనతో కొలిచారు. అనంతరం ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహనసేవ, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనమూర్తులకు అష్టోత్తర పూజలు గావించారు. సాయంత్రం స్వామి, అమ్మవారి జోడు సేవను ఆలయంలో ఊరేగించారు.

ఉరేసుకుని  నవ వధువు ఆత్మహత్య1
1/1

ఉరేసుకుని నవ వధువు ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement