‘వెన్నుపోటు దినం’ విజయవంతమైంది | - | Sakshi
Sakshi News home page

‘వెన్నుపోటు దినం’ విజయవంతమైంది

Jun 6 2025 12:52 AM | Updated on Jun 6 2025 12:52 AM

‘వెన్

‘వెన్నుపోటు దినం’ విజయవంతమైంది

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌

నరసన్నపేట: అమలు కాని హామీలు ఇచ్చి, అధికారం చేతికొచ్చాక ప్రజలకు వెన్నుపోటు పొడిచిన కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా చేపట్టిన వెన్నుపోటు దినం విజయవంతమైందని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ అన్నారు. జిల్లా వ్యాప్తంగా 8 నియోజకవర్గ కేంద్రాల్లో ఈ నిరసన కార్యక్రమానికి ప్రజలు తరలివచ్చారని తెలిపారు. కూటమిపై ఉన్న ప్రజా వ్యతిరేకతకు ఇది నిదర్శనమన్నారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు.

ముఖలింగేశ్వరుని కల్యాణోత్సవాలు ప్రారంభం

జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో జ్యేష్ట మాసం గురువారం రాత్రి ముఖలింగేశ్వర సహిత వారాహి అమ్మవారి పాంచరాత్ర కల్యాణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ముందుగా గణపతి పూజతో ప్రారంభమై ఘ నంగా ధ్వజారోహణ జరిగింది. పుణ్యాహవచనం, మంటపారాధన, బలిహరణ నిర్వహించి ముంగళం పలికారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ప్రభాకరరావు, అర్చకులు చలం ,నారా యణమూర్తి, శ్రీకృష్ణ శివాజీ తోపాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.

ఐటీఐలో ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

ఎచ్చెర్ల: ప్రభుత్వ ఐటీఐ ఎచ్చెర్ల కళాశాలలో ఐటీఐ ప్రవేశాలకు గురువారం మొదటివిడత కౌన్సెలింగ్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ఎంప్లాయిమెంట్‌ అధికారి సుధ పాల్గొని మొదటిర్యాంకు వచ్చిన కుశాలపురం గ్రామానికి చెందిన పి.చిరంజీవి అనే విద్యార్థికి అడ్మిషన్‌ అందించారు. అనంతరం కౌన్సిలింగ్‌ను కొనసాగించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ ఎల్‌.సుధాకరరావు మాట్లాడుతూ మొద టి కౌన్సెలింగ్‌కు 277 మందిని పిలిచామని, 109 మంది హాజరయ్యారని తెలిపారు. వీరిలో 101 మందిని ప్రవేశాలకు ఎంపిక చేశామన్నారు.

‘జీడి పరిశ్రమలు తెరవాలి’

కాశీబుగ్గ: పలాసలో జీడి పరిశ్రమలు బంద్‌ చేయడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే తెరిపించాలని కాష్యూ లేబర్‌ అసోసియేషన్‌ లేబర్‌ కాలనీ నాయకులు శిష్టు గోపి, అంబటి ఆనంద్‌, సీఐటీయూ నాయకులు నెయ్యిల గణపతి, పి.లక్ష్మీపతి డిమాండ్‌ చేశారు. పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 20వవార్డు లేబర్‌ కాలనీలో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. అనుమతు లు లేకుండా పరిశ్రమలు బంద్‌ చేయడం చట్ట విరుద్ధమని అన్నారు. లాభాలు వచ్చినపుడు కార్మికులకు ఇన్సెంటివ్‌ ఏమీ ఇవ్వడం లేదని, నష్టాల పేరుతో పరిశ్రమలు మూసివేయడం వల్ల కార్మికులకు ఉపాధి లేకుండా పోయిందని అన్నారు. మూసివేసిన కాలానికి కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు.

‘వెన్నుపోటు దినం’  విజయవంతమైంది
1
1/3

‘వెన్నుపోటు దినం’ విజయవంతమైంది

‘వెన్నుపోటు దినం’  విజయవంతమైంది
2
2/3

‘వెన్నుపోటు దినం’ విజయవంతమైంది

‘వెన్నుపోటు దినం’  విజయవంతమైంది
3
3/3

‘వెన్నుపోటు దినం’ విజయవంతమైంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement