
పది మూల్యాంకనంలో కూటమి వైఫల్యం
ఇసుక అక్రమ రవాణాపై తనిఖీలు
ముదిగుబ్బ: మండలంలోని కొడవండ్లపల్లి సమీపంలో మద్దిలేరు పరీవాహక ప్రాంతం నుంచి సాగిస్తున్న ఇసుక అక్రమ రవాణాపై శుక్రవారం ఆర్డీఓ మహేష్ ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేపట్టారు. రెండు హిటాచీలు, ఓ టిప్పర్ను సీజ్ చేశారు. పట్టుబడిన వాహనదారులకు జరిమానా విఽధించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ.. అనుమతులు లేకుండా రీచ్ల నుంచి ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. తనిఖీలలో మైనింగ్, ఇరిగేషన్, పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
సీపీఆర్తో ప్రాణం నిలిపారు!
కదిరి టౌన్: కరెంటు షాక్కు గురైన విద్యార్థి చనిపోయాడని అందరూ అనుకున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు కూడా మిన్నంటాయి. అంతలోనే అక్కడికి వచ్చిన కానిస్టేబుల్ దేవేంద్ర సీపీఆర్ చేసి విద్యార్థి ప్రాణాలు నిలిపారు. ఈ ఘటన కదిరి పట్టణంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు... పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయ సమీపంలో ఆంజనేయులు అనే వ్యక్తి నూతనంగా ఇల్లు నిర్మిస్తున్నాడు. అతని కుమారుడు నరసింహులు శుక్రవారం ఇంటిపైకి ఎక్కాడు. పక్కనే ఉన్న 11 కేవీ విద్యుత్ లైనును ప్రమాదవశాత్తు తాకడంతో షాక్కు గురయ్యాడు. తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. అతను మృతి చెందాడని భావించిన కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ దేవేంద్ర వెంటనే అక్కడికి చేరుకుని బాలుడికి సీపీఆర్ చేయడంతో ప్రాణాలు నిలిచాయి. తర్వాత బాలుణ్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం తరలించారు. విద్యార్థి నరసింహులు పట్టణంలోని ఓ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు.
పుట్టపర్తి: పదో తరగతి మూల్యాంకనం మొత్తం తప్పుల తడకగా సాగిందని, విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటమాడిందని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు అమరనాథరెడ్డి, రాజేంద్రప్రసాద్ ధ్వజమెత్తారు. మూల్యాంకనంలో ప్రభుత్వ వైఫల్యం కారణంగా నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలంటూ డీఈఓ కార్యాలయ సిబ్బందికి శుక్రవారం వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ఈ ఏడాది ఏప్రెల్ 23న పదో తరగతి ఫలితాలు వెలువడ్డాయని, ఇందులో చాలా మంది విద్యార్థులు పరీక్ష తప్పటంతో పాటు మార్కులు సైతం తక్కువగా వచ్చాయని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 66 వేల మంది పై చిలుకు విద్యార్థులు రీ వాల్యూషన్కు దరఖాస్తు చేసుకుంటే 11 వేల మంది విద్యార్థులు పాస్ అయ్యారని, మార్కులు కూడా బాగా పెరిగాయని పేర్కొన్నారు. దీనిని బట్టి చూస్తుంటే ఫలితాలు రికార్డు స్థాయిలో తొందరగా విడుదల చేయాలనే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిర్ణయం కారణంగా మూల్యాంకనంలో తప్పిదాలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. అన్ని సబ్జెక్టులలో 90 శాతం మార్కుల సాధించిన విద్యార్థిని సైతం ఫెయిల్గా పేర్కొనడం రేశ చరిత్రలో ఎక్కడా లేదన్నారు. ప్రభుత్వం చేత కానితనం వల్ల అనేక మంది విద్యార్థులు ట్రిపల్ ఐటీ, ఇతర కోర్సులలో సీట్లు కోల్పోయారన్నారు. కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగా నష్టపోయిన ప్రతి విద్యార్థికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పురుషోత్తం, ఉపాధ్యక్షుడు చంద్రశేఖర్, నాయకులు నరేష్రెడ్డి, బాబ్జాన్, భానుప్రకాష్రెడ్డి పాల్గొన్నారు.
వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు
అమరనాథరెడ్డి, రాజేంద్రప్రసాద్

పది మూల్యాంకనంలో కూటమి వైఫల్యం

పది మూల్యాంకనంలో కూటమి వైఫల్యం

పది మూల్యాంకనంలో కూటమి వైఫల్యం