ప్లాస్టిక్‌ను తరిమికొడదాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ను తరిమికొడదాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం

Jun 6 2025 7:38 AM | Updated on Jun 6 2025 7:38 AM

ప్లాస్టిక్‌ను తరిమికొడదాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం

ప్లాస్టిక్‌ను తరిమికొడదాం.. పర్యావరణాన్ని రక్షిద్దాం

ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జిల్లాలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట మున్సిపల్‌ ఆధ్వర్యంలో ర్యాలీ, మానవహారం చేపట్టి అవగాహన కల్పించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో జంతుశాస్త్ర విభాగం ఇన్‌చార్జి హేమలత మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకుంటేనే మానవ మనుగడ కొనసాగుతుందన్నారు. ప్రభుత్వ మహిళా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జీవన్‌కుమార్‌ మాట్లాడుతూ ‘ఏక్‌ పేడ్‌ మా కే నామ్‌’ అని నినదిస్తూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వృక్షాలుగా ఎదిగే వరకు కాపాడాలన్నారు. అలాగే సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన కార్యక్రమాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ ఆశ్రిత్‌ కుమార్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్నారు. ప్లాస్టిక్‌ వాడకం అత్యంత ప్రమాదకరమన్నారు. పరిశుభ్రత, పచ్చదనం, మన సంస్కృతిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు.

– సిద్దిపేట జోన్‌/సిద్దిపేటఎడ్యుకేషన్‌/ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట)

నేను సైతం..

ఊరిలో ఎవరికి అడ్డుగా ఉందనో.. లేక మరే కారణంతోనో పెద్ద రావిచెట్టు కొమ్మలన్నీ నరికేసి మోడు చేశారు. కొమ్మలన్నీ ఎండిపోయినా.. మొదలు సగానికి పైగా నరికినా.. ఆచెట్టు మాత్రం పర్యావరణానికి నేను సైతం అంటూ చిగురించింది ఇలా.. నంగునూరు మండలం రాజగోపాలపేటలో సాక్షి కెమెరా క్లిక్‌మనిపించింది.

– సాక్షిస్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, సిద్దిపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement