
పర్యావరణ పరిరక్షణపై అవగాహన అవసరం
సిద్దిపేటరూరల్: పర్యావరణ పరిరక్షణపై ప్రతీ ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి అన్నారు. కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవ పోస్టర్ను బుధవారం తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించడంలో ప్రతీ ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షిస్తేనే భావితరాలకు మంచి గాలి, నీరు, నేలను అందించే వారమవుతామన్నారు. కార్యక్రమంలో కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయ ఆర్సీపురం సహాయ పర్యావరణ శాస్త్రవేత్త టి. రవీందర్ పాల్గొన్నారు.