మానవ అక్రమ రవాణాను అరికడదాం | - | Sakshi
Sakshi News home page

మానవ అక్రమ రవాణాను అరికడదాం

Jun 6 2025 7:38 AM | Updated on Jun 6 2025 7:38 AM

మానవ అక్రమ రవాణాను అరికడదాం

మానవ అక్రమ రవాణాను అరికడదాం

జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి

ప్రశాంత్‌నగర్‌(సిద్దిపేట): మానవుల అక్రమ రవాణాను అరికట్టడం అందరి బాధ్యత అని జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో ట్రైనింగ్‌ ఆన్‌ చైల్డ్‌ సేఫ్టీ సెక్యూరిటీ పేరుతో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని గురువారం డీఈఓ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ రోజూ ఎంతో మంది బాలికలు, యువతులు, మహిళలు అక్రమ రవాణాకు గురవుతున్నారన్నారు. ముఖ్యంగా ఉద్యోగం, సినిమా అవకాశాల పేరుతో విదేశాలకు విక్రయిస్తున్నారన్నారు. ప్రతి మహిళ తమ పరిధిలో ఉన్న వారికి అవగాహన కల్పించి రక్షించాలన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ 29 ఏళ్లుగా డాక్టర్‌ సునీత కృష్ణన్‌ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు 29,200 మంది బాలికలు, యువతులు, మహిళలను కాపాడి పునరావాసం కల్పించారన్నారు. అనంతరం కమ్యూనిటీ మొబిలైజింగ్‌ అధికారి రంగనాథ్‌ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న అక్రమ రవాణాను అరికట్టడంలో అందరు భాగస్వామ్యం కావాలన్నారు. ప్రతి గ్రామాలలో కమ్యూనిటీ విజిటింగ్‌ గ్రూప్‌లను ఏర్పాటు చేయడంతో అందరూ అప్రమతంగా ఉంటారన్నారు. అక్రమ రవాణాకు గురైన వారు పిల్లలు శ్రమ, లైంగిక దోపిడీకి గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పోలీస్‌ అధికారులు, ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement