
హైరిస్క్ గర్భధారణపై జాతీయ సదస్సు
మాదాపూర్: యశోద హాస్పిటల్స్–హైటెక్సిటీ ప్రసూతి, గైనకాలజీ విభాగం ఆధ్వర్యంలో హైరిస్క్ గర్భధారణపై ఆదివారం జాతీయ స్థాయి సదస్సు, లైవ్వర్క్షాప్ నిర్వహించారు. 500మందికి పైగా గైనకాలజిస్టులు, సర్జన్లు ఈ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్బంగా యశోధ గ్రూప్ ఆప్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ ఈ సదస్సులో విభిన్న వైద్య విభాగాల నుంచి అనుభవజ్ఞులైన ప్రముఖ వైద్య నిపుణులు పాల్గొన్నారన్నారు. హైరిస్క్ ప్రెగ్నెన్సీ నిర్వహణలో ఇబ్బందులను అధిగమిస్తూ నూతన మార్గదర్శకాలు, ఆధునిక సాంకేతికతలను ఉపయోగించి సంక్లిష్టమైన శస్త్రచికిత్సలను మరింత సులభంగా,కచ్చితత్వంతో ఎలా నిర్వహించాలో అవగాహన కల్పించారనానరు. యశోధ హాస్పిటల్ సీనియర్ గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణవేణి మాట్లాడుతూ ప్రసూతి సమయంలో అత్యంత క్లిష్టమైన గర్భధారణలో విజయవంతంగా తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. గర్భధారణలో రుమటలాజికల్, ఎండోక్రైన్ రుగ్మతలు, ప్రసూతి సమయంలో అత్యవసరపరిస్థితులు, గుండె సమస్యలు తదితర అంశాలపై తల్లీబిడ్డలను సురక్షితంగా ఎలా కాపాడాలో సెషన్లను నిర్వహించినట్లు తెలిపారు.