
మీనం ‘బంగారం’
మృగశిర కార్తె సందర్భంగా చేపలకు భారీ డిమాండ్ ఏర్పడింది. కార్తె ప్రారంభం రోజున చేపలను ఆరగించడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆదివారం ఆమనగల్లు, ఇబ్రహీంపట్నం తదితర ప్రాంతాల్లో విక్రయాలు జోరుగా సాగాయి. ఇదే అదనుగా భావించిన వ్యాపారులు ధరలు అమాంతం పెంచేశారు. బంగారు తీగలు, రవ్వలు కిలో రూ.200,బొచ్చలు కిలో రూ.300లు, కొరమీను(కొర్రమట్ట) రూ.1500లకు పైగా ధర పలికింది. సాధారణ రోజుల్లో కంటే రెట్టింపు రేటుపలికినా.. కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపారు. చికెన్, మటన్ దుకాణాల్లోనూ సందడి నెలకొంది.
–సాక్షి, నెట్వర్క్

మీనం ‘బంగారం’

మీనం ‘బంగారం’

మీనం ‘బంగారం’

మీనం ‘బంగారం’

మీనం ‘బంగారం’