బహుమతుల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

బహుమతుల ప్రదానం

Jun 9 2025 7:52 AM | Updated on Jun 9 2025 7:52 AM

బహుమతుల ప్రదానం

బహుమతుల ప్రదానం

మలక్‌పేట: రంగారెడ్డి జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో విక్రాంత్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలో నాలుగు రోజుల పాటు జరిగిన జిల్లా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌ షిప్‌–2025 పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంతర్జాతీయ మాజీ క్రీడాకారిణి, గోపిచంద్‌ అకాడమీ కోచ్‌ దీప్తిరెడ్డి, అంతర్జాతీయ మాజీ క్రీడాకారుడు, అంతర్జాతీయ కోచ్‌ గురుసాయిదత్త ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీలలో1000 మంది క్రీడాకారులు పాల్గొన్నారని అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి కరెడ్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యాక్షుడు పి. ఆనంద్‌బాబు, సంయుక్త కార్యదర్శి సాయిరెడ్డి, మాజీ కార్పొరేటర్‌ సామా ప్రభాకర్‌రెడ్డి, బీఏటీ సంయుక్త కార్యదర్శి యూబీఎన్‌బాబు, రవణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement