
మిర్గం ర(ఫి)ష్
మృగశిరకార్తే ప్రవేశించిన రోజు చేపల కోసం జనాలు ఆదివారం తెల్లవారు జాము నుంచే మార్కెట్ బాట పట్టారు. ఇన్నాళ్లు ఎండలు దంచికొట్టడంతో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదుకాగా.. మృగశిరకార్తేతో వర్షాలు మొదలవుతాయి. వాతావరణంలో మార్పులు సంభవించే సమయంలో శరీరంలో మార్పులు.. ఉబ్బసం వంటి వ్యాధి నివారణకు చేపల కొనుగోలు చేశారు. మరికొందరు చేప మందు తీసుకునేందుకు ఆసక్తి చూపారు. చేపలకు గిరాకీ ఉండడంతో బొమ్మెలు కిలోకు రూ.500, రవులు రూ.200, రొయ్యలు రూ.600 ధర పలికాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్నసిరిసిల్ల