
పేదలకు ఆపన్నహస్తం అందించడమే లక్ష్యం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: పేదలకు ఆపన్నహస్తం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. పట్టణంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి అధికారులు, పార్టీ నాయకులతో కలసి ఆదివారం భూమిపూజ చేశారు. గత ప్రభుత్వం ఎన్నికల్లో లబ్ధి కోసమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని హామీలిచ్చి తుంగలో తొక్కారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి నిర్మిస్తున్నట్లు తెలిపారు. త్వరలో భూమిలేని పేదలకూ భూమితోపాటు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేస్తామన్నారు.
క్షత్రియ అన్నదాన సత్రం నిర్మాణానికి భూమి పూజ
వేములవాడఅర్బన్: వేములవాడలో శ్రీరాజరాజేశ్వర సగర క్షత్రియ అన్నదాన సత్రం భవన నిర్మాణానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ ఆదివారం భూమి పూజ చేశారు. సత్రం అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, రాష్ట్ర కోశాధికారి కుమారస్వామి, ప్రధాన కార్యదర్శి సీత కమలాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెద్దబుద్దుల సతీశ్సాగర్, రాష్ట్ర యువజన సంఘం ప్రధాన కార్యదర్శి ఉప్పరి మహేందర్, గంటి శ్రీనివాస్, సమ్మన్న పాల్గొన్నారు.
బీసీలు సంఘటితమైతేనే రాజ్యాధికారం
సిరిసిల్లకల్చరల్: బీసీలు సంఘటితమైతేనే రాజ్యాధికారం సాధ్యమని సమితి రాష్ట్ర అధ్యక్షుడు కటకం నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక వస్త్ర, వ్యాపార సంఘ భవనంలో జరిగిన సమితి సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చైతన్యమే ఆయుధంగా జ్యోతిబాపూలే, బాబాసాహెబ్ అంబేడ్కర్ ఆలోచన విధానంతో ఐకమత్యాన్ని సాధించి రాజ్యాధికారం సంపాదించుకోవాలని పిలుపునిచ్చారు. అధికార సాధనతోనే బీసీల్లో సామాజిక, ఆర్థిక స్థిరత్వం వస్తుందన్నారు. త్వరలోనే ప్రతి బీసీ కులం నుంచి ఇద్దరు ప్రతినిధులను సమన్వయ కర్తలు నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 15న బీసీ చైతన్య పతాకాన్ని ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దొంత ఆనందం, మంగలిపల్లి శంకర్, శ్రీగాద మైసయ్య, దొంత దేవదాస్, వెంగల అంకయ్య, వెంగల లక్ష్మణ్, డాక్టర్ జనపాల శంకరయ్య పాల్గొన్నారు.

పేదలకు ఆపన్నహస్తం అందించడమే లక్ష్యం