
చెరువులు ధ్వంసమవుతున్నాయి
అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. కొందరు తమ స్వార్థం కోసం మట్టిని తరలిస్తుండగా.. చెరువులు, కుంటలు, గుట్టలు ధ్వంసమవుతున్నాయి. మండలం నుంచి నిత్యం 20 నుంచి 25 వాహనాల వరకు మట్టిని తోడేస్తున్నాయి. మైనింగ్, రెవెన్యూ అధికారులు మట్టి తరలిపోకుండా తగు చర్యలు తీసుకోవాలి.
– నిమ్మల బాబు, రైతు, దుమాల
అనుమతులు లేకపోతే చర్యలు
అనుమతులు లేకుండా మట్టి తరలిస్తే చర్యలు తీసుకుంటాం. వాహనాలను సీజ్ చేస్తాం. నిబంధనల ప్రకారం అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. పెద్ద ఎత్తున జరిమానాలు విధిస్తాం. అవసరాల కోసం మట్టి తప్పనిసరైతే మైనింగ్, రెవెన్యూ అధికారుల నుంచి అనుమతులు తీసుకోవాలి. అప్పులే మట్టి కొట్టుకోవాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం.
– సుజాత, తహసీల్దార్

చెరువులు ధ్వంసమవుతున్నాయి