సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చొద్దు | - | Sakshi
Sakshi News home page

సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చొద్దు

Apr 21 2025 12:57 AM | Updated on Apr 21 2025 12:57 AM

సిరిస

సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చొద్దు

● ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ అశోక్‌

సిరిసిల్ల: సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చొద్దని, నేతన్నలు ఆత్మస్థైర్యం కోల్పోవద్దని ఆత్మహత్యల నివారణ కమిటీ రాష్ట్ర చైర్మన్‌ డాక్టర్‌ పరికిపండ్ల అశోక్‌ కోరారు. సిరిసిల్లలో ఇటీవల ఆత్మహత్యలకు పాల్పడిన నేతన్నల కుటుంబాలను ఆదివారం పరామర్శించి మాట్లాడారు. నేతకార్మికులు ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. నేతకార్మికులు వస్త్రాన్ని నేయడంలో గొప్ప కళాకారులని, దారంపోగులను ఏకం చేసి బట్టను నేసే సూక్ష్మ నైపుణ్యత వారికే ఉందన్నారు. పద్మశాలి సంఘం నాయకులు గోనె ఎల్లప్ప, పద్మశాలి జాతీయ పరిషత్‌ అధ్యక్షుడు కొక్కుల భాస్కర్‌, యువనాయకులు పత్తిపాక సురేశ్‌, రమేశ్‌, జనార్దన్‌, వీరేందర్‌ పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచండి

బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి

ఎల్లారెడ్డిపేట (సిరిసిల్ల): అకాల వర్షాలు వెంటాడుతున్నందునా ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి కోరారు. మండలకేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. అకాల వర్షాలతో ముస్తాబాద్‌, గంభీరావుపేట మండలాల్లో చేతికొచ్చిన వరి పంట నేలరాలిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంటనష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కోరారు. వర్షాలకు తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనాలన్నారు. పార్టీ మండలాధ్యక్షుడు పొన్నాల తిరుపతిరెడ్డి, నాయకులు చందుపట్ల లక్ష్మారెడ్డి, చందుపట్ల రాజిరెడ్డి, పారిపెల్లి సంజీవరెడ్డి, మద్దుల బుగ్గారెడ్డి, కోనేటి సాయిలు, కిరణ్‌నాయక్‌, దాసరి గణేశ్‌ పాల్గొన్నారు.

బదిలీ షెడ్యూల్‌ విడుదల చేయాలి

సిరిసిల్లకల్చరల్‌: ఈ వేసవి సెలవుల్లోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులకు షెడ్యూల్‌ విడుదల చేయాలని టీపీటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు చకినాల అనిల్‌కుమార్‌ కోరారు. సిరిసిల్ల ఆదివారం నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. పాఠశాలల అభివృద్ధికి చాలినన్నీ నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యక్షుడు పాతూరి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ డీఏ, పెండింగ్‌ బిల్లులు విడుదల చేయాలని, సీపీఎస్‌ రద్దు చేయాలని కోరారు. కొలుగూరి కిషన్‌రావు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దుమాల రమానాథ్‌, వికృతి అంజయ్య, పురం వాసుదేవరావు, దబ్బెడ హనుమాండ్లు, మందాడి శ్రీనివాసరెడ్డి, దేవేందర్‌, తిరుపతి, శ్రీధర్‌, మైలారం తిరుపతి, చకినాల రామచంద్రం, రాజేందర్‌, భాస్కర్‌, సిద్ధంశెట్టి శ్రీనివాస్‌, రమేశ్‌రెడ్డి, రాంప్రసాద్‌ పాల్గొన్నారు.

నేడు నేషనల్‌ సెమినార్‌

గంభీరావుపేట(సిరిసిల్ల): స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం నేషనల్‌ సెమినార్‌ నిర్వహించనున్నారు. విద్య, పరిశోధనరంగంలో కృత్రిమ మేథస్సు(ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌)పై ఒకరోజు సెమినార్‌ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. వివిధ రాష్ట్రాల నుంచి డిగ్రీ, యూనివర్సిటీ స్థాయి అధ్యాపకులు హాజరై పేపర్‌ ప్రజెంటేషన్‌, ప్యానల్‌ డిస్కషన్‌, పోస్టర్‌ ప్రజంటేషన్‌ ఇవ్వనున్నారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజేస్‌ నుంచి ప్రొఫెసర్ల బృందం కళాశాలకు రానుంది. తెలంగాణ కౌన్సిల్‌ ఆఫ్‌ హైయర్‌ ఎడ్యుకేషన్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకానున్నట్లు ప్రిన్సిపాల్‌ విజయలక్ష్మి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ శ్రావణ్‌కుమార్‌ తెలిపారు.

సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చొద్దు
1
1/3

సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చొద్దు

సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చొద్దు
2
2/3

సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చొద్దు

సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చొద్దు
3
3/3

సిరిసిల్లను ఉరిసిల్లగా మార్చొద్దు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement