
సూర్యప్రభ, హంస వాహనంపై నారసింహుడు
సింగరాయకొండ: పురాణ ప్రసిద్ధి చెందిన పాతసింగరాయకొండ వరాహా లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో స్వామివారు ఆదివారం సూర్య ప్రభ, హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాల సందర్భంగా ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈఓ పి.కృష్ణవేణి తెలిపారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సహకారంతో చలువ పందిళ్లకు బదులు శాశ్వతప్రాతిపదికన రేకుల షెడ్డు నిర్మించామన్నారు. సోమవారం సాయంత్రం శ్రీ కృష్ణ యాదవ్ యూత్ఫోర్స్ ఆధ్వర్యంలో పొట్టేలు పందెం ఏర్పాటు చేశామని, స్వామివారు శేష వాహనంపై భక్తులకు దర్శనమిస్తారని వివరించారు.
ఆటోను ఢీకొన్న ట్రాక్టర్
● ఆటో డ్రైవర్ మృతి
సింగరాయకొండ: మామిడికాయల ఖాళీ ప్లాస్టిక్ ట్రేలతో వెళ్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో ఆటో డ్రైవర్ పోట్టేళ్ల జగదీష్కుమార్(20) మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం జాతీయరహదారిపై జీవీఆర్ ఆక్వా కంపెనీ సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మండలంలోని సోమరాజుపల్లి పంచాయతీకి చెందిన జగదీష్కుమార్ ఉలవపాడు మండలం కొల్లూరుపాడులో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్గా జీవిస్తున్నాడు. ప్రతిరోజు లాగే ఒంగోలుకు మామిడికాయలు తీసుకుని వెళ్లి తిరుగుప్రయాణంలో వస్తుండగా ఆటో జీవీఆర్ ఆక్వా కంపెనీ సమీపంలోని రాగానే వెనకాల వేగంగా వస్తున్న ట్రాక్టర్ బలంగా ఢీకొట్టింది. ఘటనలో ఆటో బోల్తా పడటంతో కిందపడిన జగదీష్కు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్ ట్రక్కును రోడ్డుపై వదిలి ఇంజన్తో సహా పరారయ్యాడు. మృతునికి వివాహం కాలేదు. చేతికి అందివచ్చిన కొడుకు అకాల మరణంతో తండ్రి మాల్యాద్రి రోదన చూపరులను కలిచివేసింది. ఎస్సై బి.మహేంద్ర కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సూర్యప్రభ, హంస వాహనంపై నారసింహుడు

సూర్యప్రభ, హంస వాహనంపై నారసింహుడు