
వైభవంగా వేణుగోపాలుడి బ్రహ్మోత్సవాలు
పామూరు: మండల కేంద్రమైన పామూరులోని మదన వేణుగోపాలస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు గురువారం వైభవంగా ప్రారంభమయ్యాయి. రుక్మిణి, సత్యభామా సమేత మదన వేణుగోపాలస్వామి వారికి గురువారం రుత్విక్కులు నారాయణయం సత్యబాబు, గోపి పూజలు చేశారు. ఈఓ శ్రీగిరిరాజు నరసింహబాబు ఆధ్వర్యంలో నగర సంకీర్తన, అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివార్లకు ఈఓ దేవాదాయశాఖ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించారు. మొదటిరోజు బ్రాహ్మణ ఉభయం ఘనంగా నిర్వహించారు. వేద సభ నిర్వహించి ఎమ్మెల్యే ఉగ్ర దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. కనిగిరి డీఎస్పీ సాయి ఈశ్వర్ యశ్వంత్, సీఐ భీమానాయక్ పూజల్లో పాల్గొనగా స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సంఘ నాయకులు ఆకుమళ్ల చలపతిరావు, డాక్టర్ దీక్షితులు, నెల్లూరు నరసింహారావు, విఠపు కుమార్, కొల్లూరు రవికిరణ్శర్మ, మహంకాళి శివప్రసాద్, జొన్నాబొట్ల గురునాథప్రసాద్, బండ్లా నారాయణ, గుర్రం వెంకటేశ్వర్లు, భక్తులు పాల్గొన్నారు.