
అధికారులు గులాం!
ఓటమి పెత్తనం..
కూటమి ప్రభుత్వంలో
ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ
ఎమ్మెల్యేలకు ప్రత్యేక రాజ్యాంగం
అమలవుతోంది. జిల్లాలో దర్శి,
యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పేరుకే వారు ఎమ్మెల్యేలు.. అక్కడ
పెత్తనమంతా అధికార పార్టీ నాయకులదే. ప్రభుత్వం మాది.. పెత్తనమూ మాదే అన్న విధంగా ఆ నియోజకవర్గాల్లో పరిస్థితులు నెలకొన్నాయి. కనీసం వార్డు సభ్యులు కూడా కాని వారికి అధికార యంత్రాంగం జీ హుజూర్ అంటోంది. కనీస ప్రొటోకాల్ అమలు విషయంలో కూడా వివక్ష
కనిపిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారికంగా జరిగే జిల్లా స్థాయి సమీక్షల్లో కూడా వారికి రాచమర్యాదలు సాగుతున్నాయి. ప్రజల మద్దతుతో
గెలిచిన వారిని కాదని వీరికి
పెద్ద పీట వేస్తుండడంపై విమర్శలు
వెల్లువెత్తుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: గత సార్వత్రిక ఎన్నికలలో జిల్లాలో దర్శి, యర్రగొండపాలెంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు బూచేపల్లి శివప్రసాద్రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ విజయం సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ నియోజకవర్గాల నుంచి టీడీపీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన అభ్యర్థులు నేడు పెత్తనం చలాయిస్తున్నారు. రాజ్యాంగేతర శుక్తుల్లా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పోలీసు ఎస్కార్ట్తో నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ప్రభుత్వ కార్యకలాపాలలో అధికారికంగా పాల్గొంటున్నారు. రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నార్న విమర్శలు ఉన్నాయి. ఈ ఇన్చార్జిల తీరుపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ అటు పాలకులు, ఇటు అధికారులకు ఏమాత్రం చీమకుట్టినట్టయినా లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
యర్రగొండపాలెంలో ఎరిక్షన్దే పెత్తనం...
యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ను ప్రజలు గెలిపించుకున్నారు. అయితే, దొడ్డిదారిన టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్ బాబు అధికారం చలాయిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నియోజకవర్గంలో రైతులకు పనిముట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఎమ్మెల్యే చేతుల మీదుగా జరగాలి. కానీ, అందుకు విరుద్ధంగా గత ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థిచేత పంపిణీ చేయించడంతో ప్రజలు విస్తుపోయారు. యోగా సన్నాహక కార్యక్రమంలో కూడా ఇదే పునరావృతమైంది. జిల్లా అధికారులు హాజరైన ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేకు కనీసం ఆహ్వానం కూడా లేదంటే కూటమి పాలకుల తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రజాస్వామికవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే తాటిపర్తి అధికారికంగా ఏదైనా కార్యక్రమం, సమీక్షగానీ నిర్వహిస్తే సంబంధిత శాఖ అధికారులు మొహం చాటేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యర్రగొండపాలెంలో ఇదే దుస్సంప్రదాయం కొనసాగుతోంది. నియోజకవర్గంలో ఒక సర్పంచ్గా కూడా ఎన్నిక కాని వ్యక్తి అంతా తానే అయినట్లు అధికారం చలాయించడం, పోలీసు ఎస్కార్ట్తో ప్రజల మధ్య తిరగడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లా సమావేశాలలో కూడా అదే తీరు..
ఆ మధ్య నాటుసారాకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నవోదయం అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఒంగోలు జిల్లా పోలీసు కార్యాయలంలోని పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేశారు. ఎకై ్సజ్ శాఖామంత్రి కొల్లు రవీంద్ర హాజరైన ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. అయితే వేదిక మీద ఎమ్మెల్యేలతో పాటుగా దర్శి టీడీపీ ఇచ్చార్జి గొట్టిపాటి లక్ష్మి, యర్రగొండపాలెం ఇన్చార్జి ఎరిక్షన్బాబుకు కూడా సమానంగా కుర్చీలు కేటాయించారు. ఈ విషయం మీద అనేక విమర్శలు వచ్చాయి. అంతేగాకుండా ఇటీవల జరిగిన డీఆర్సీ మీటింగులో కూడా వీరిద్దరికీ కుర్చీలు కేటాయించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా సరే నిబంధనలను ఉల్లంఘిస్తున్నామన్న భావన అధికారులలో ఏమాత్రం కనిపించడంలేదు. తమ పరిధికి మించి వ్యవహరిస్తున్నామన్న ఆలోచన నాయకులు చేయడం లేదని మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనధికార ఎమ్మెల్యే చుట్టూ...
గత ఎన్నికలలో ఓటమి పాలైన అభ్యర్థులకు జిల్లా అధికారులు జీ హుజూర్ అనడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. దర్శి, యర్రగొండపాలెం అనధికార ఎమ్మెల్యేల చుట్టూ తిరగలేక అధికారులు పడరానిపాట్లు పడుతున్నారు. యర్రగొండపాలెంలో అయితే ఇన్చార్జి అవినీతిని కాపుకాయలేక చస్తున్నామని ఒక అధికారి వాపోవడం గమనార్హం. ప్రతిరోజూ ఉదయాన్నే మార్కాపురంలో నివాసం ఉంటే ఆయన్ను కలిసి నమస్కారం పెట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు గుడ్ మార్నింగ్ చెప్పకపోతే వేధింపులు తప్పడంలేదని వాపోయారు. దాంతో ఉద్యోగులంతా ఎమ్మెల్యే తాటిపర్తిని కాదని అనధికార ఎమ్మెల్యే చుట్టూ తిరగడం తప్పడంలేదని చెబుతున్నారు. ఎమ్మెల్యేల కంటే టీడీపీ ఇన్చార్జిల పెత్తనం ఎక్కువైపోయిందని ఉద్యోగ సంఘాల నాయకులు కామెంట్ చేస్తున్నారు. దర్శిలో ఈ పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నట్లు చెప్పుకుంటున్నారు. అక్కడ మేడం గారితో పాటు సార్ను కూడా గౌరవించుకోక తప్పడంలేదన్న ప్రచారం జరుగుతోంది. మేడమ్ తీరు పట్ల ఉద్యోగులలో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
దర్శి, యర్రగొండపాలెం నియోజకవర్గాల్లో ప్రత్యేక రాజ్యాంగం రెండు చోట్లా వైఎస్సార్ సీపీ గెలిస్తే పెత్తనం మాత్రం టీడీపీ నేతలదే దర్శిలో ప్రభుత్వాధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్న టీడీపీ ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి యర్రగొండపాలెంలో టీడీపీ ఇన్చార్జి ఎరిక్షన్బాబు మాటే వేదం జిల్లా స్థాయి అధికారిక సమావేశాల్లోనూ వారికి రాచమర్యాదలు పోలీసు ఎస్కార్ట్తో దర్జా ఒలకబోస్తున్న టీడీపీ నేతలు ఇన్చార్జిలకు సలాం చేస్తున్న అధికారులు
దర్శిలో లక్ష్మి దర్పం..
ఆమె ఎమ్మెల్యే కాదు. పోనీ మండలాధ్యక్షురాలా అంటే అదీ కాదు. సర్పంచ్ కూడా కాదు. చివరకు గ్రామ వార్డు మెంబర్గా కూడా గెలవలేదు. ఆమె గత ఎన్నికలలో పోటీ చేసి ఓటమిపాలైన ఒక అభ్యర్థి మాత్రమే. అయినా సరే దర్శి నియోజకవర్గంలో ఆమెదే పెత్తనం. ఎన్నికలలో ఓటమి పాలైన మొదటి నెలలోనే దర్శిలోని ఒక ప్రభుత్వ ఆస్పత్రి తనిఖీకి వెళ్లారు. ఏకంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ కుర్చీలో కూర్చుని ఫైళ్లను పరిశీలించారు. అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారంపై ప్రజలు ముక్కమీద వేలేసుకున్నారు. అయినా సరే ఆమెకు పట్టలేదు. ఇప్పటికీ అదే ధోరణి కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లి అధికారులపై పెత్తనం చలాయిస్తున్నారు. అధికారులను ఇంటి వద్దకు పిలిపించుకుని ఎమ్మెల్యేలా సమీక్షలు చేస్తున్నారు. సీఐలు, ఎస్సైల ఎస్కార్ట్ లేకుండా ఇంటి నుంచి బయటకు ఆమె అడుగు పెట్టడం లేదంటే ఎంతగా అధికారం చలాయిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. నియోజకవర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికార యంత్రాంగం మాత్రం ఆమె ముందు సాగిలపడడం సరికాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అధికారులు గులాం!