
జిల్లా ఏర్పాటు ఎప్పుడో...?
అధికారంలోకి రాగానే మార్కాపురం జిల్లా ఏర్పాటు చేస్తానని చంద్రబాబునాయుడు హామీ ఇచ్చి ఏడాది దాటుతోంది. ఇంత వరకూ కార్యరూపం దాల్చలేదు. మార్కాపురం జిల్లాగా ఏర్పాటైతేనే ఈ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది. ఏడాది కావస్తున్నా ఇంత వరకూ ప్రకటనలే తప్ప ఆచరణలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ప్రస్తుతం పుల్లలచెరువు, అర్ధవీడు, గిద్దలూరు, కొమరోలు మండలాల ప్రజలు ఒంగోలుకు వెళ్లి పనులు చూసుకుని రావాలంటే ఒకరోజు సమయం పడుతోంది. మార్కాపురం జిల్లా ఏర్పాటైతే ఈ సమస్యలు తీరుతాయి.
– కేవీ రమణారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి, పొదిలి