
ప్రభుత్వం పనిచేయకపోతే ప్రశ్నిస్తా అంటూ గతంలో హడావుడి చే
ఆస్పత్రిలో ఉంటే...
పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి కడప జిల్లాకు చెందిన వ్యక్తి. బీటెక్ చేసి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాడు. వినాయక చవితి పండుగ సమయంలో విగ్రహం ఏర్పాటుకు డబ్బులు వసూలు చేయడాన్ని ప్రశ్నించాడు. అది కూటమి పాలకులకు పెద్ద నేరంగా కనిపించింది. అతడి మీద సంతనూతలపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేయించింది. తిరుపతిలో మరో కేసు బనాయించింది. ఈలోపు అనుకోకుండా సదరు యువకుడికి ఆరోగ్యం దెబ్బతింది. దాంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స కోసం వెళ్లాడు. వైద్యులు అతడికి ఆపరేషన్ చేయాలని నిర్ధారించారు. దాంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాడు. అతడిని అరెస్టు చేసేందుకు తిరుపతి పోలీసులు ఆస్పత్రికి వెళ్లారంటే రెడ్బుక్ రాజ్యాంగం దుర్మార్గాలను అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ తరువాత ప్రవీణ్ కుమార్ రెడ్డి ఒంగోలు రూరల్ పోలీసు స్టేషన్కు వచ్చి సీఐ ఎదుట విచారణకు హాజరయ్యాడు.