
కూటమి పాలకులు నా నోటికాడ కూడు తీసేశారు
కూటమి ప్రభుత్వం వచ్చాక చిరుద్యోగులను తొలగించి వారి నోటికాడ కూడు తీసేసింది. నేను 2009 నుంచి ఎన్ఆర్ఈజీఎస్లో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్నా. నెలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకూ వేతనం లభించేది. భార్య, ఇద్దరు పిల్లలను చదివించుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నా. కూటమి ప్రభుత్వం వచ్చాక టీడీపీ నాయకుల ఒత్తిడితో అధికారులు నన్ను తొలగించారు. ప్రస్తుతం నా పరిస్థితి దయనీయంగా ఉంది. పొట్టకూటి కోసం బేల్దారి పనికి వెళ్తున్నా.
– పరిశపోగు జీవన్, దొడ్డిచింతల,
హెచ్ఎం పాడు మండలం