
దొనకొండ కారిడార్ సంగతేంటి..?
దొనకొండలో 25 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో దొనకొండలో రాజధాని ఏర్పాటు చేయాలని శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఇచ్చింది. ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. అవేవీ పట్టించుకోని చంద్రబాబు దొనకొండను పారిశ్రామిక కారిడార్ చేస్తానంటూ హంగామా చేశారు. 2014–19లో దొనకొండకు ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదు. తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదేపాట పాడుతున్నారు. బ్రిటీష్ పాలనలో ఇక్కడ ఏర్పాటు చేసిన విమానాశ్రయాన్ని మూలనపడేశాడు. నిజానికి దొనకొండను పారిశ్రామికకారిడార్గా చేసేపనైతే విమానాశ్రయాన్ని ఒంగోలు తరలించడం దేనికనే ప్రశ్నకు సమాధానం లేదు.